1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:05 IST)

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆంధ్రా కూలీలు దుర్మరణం

కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కూలీలు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో సంభవించింది. 
 
ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. దినసరి కూలీలతో వెళ్తున్న జీపు చింతామణి సమీపంలోని మరనాయకహళ్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడటంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
మృతి చెందిన ఎనిమిది మందిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ కూలీలంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. వారంతా కూలీలని, పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని వెల్లడించారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామన్నారు.