1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (12:53 IST)

సుప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర ముగిసింది

సుప్రిసిద్ధ అమర్నాథ్ యాత్ర ముగిసింది. ఈ యాత్ర మొత్తం 56 రోజుల పాటు సాగింది. చారీ ముబారక్​ ఈశ్వరుడి చెంతకు చేరుకోవడం వల్ల.. ఆలయ అధికారులు, పండితులు, సాధువులు సమపన్ పూజను నిర్వహించారు. 
 
శ్రావణ పూర్ణిమ రోజు నిర్వహించిన సంప్రదాయ పూజా కార్యక్రమాలతో 56 రోజుల సుప్రసిద్ధ అమర్​నాథ్ యాత్రకు ముగిసినట్టయింది. హిమలింగ రూపంలో గుహలో కొలువైన ఈశ్వరుడి చెంతకు చారీ ముబారక్ చేరుకోవడం వల్ల.. ఆలయాధికారులు, పండితులు, సాధువులు ఘనంగా సమపన్ పూజను నిర్వహించారు.
 
కాగా, ఈ యాత్ర జూన్ 28న సంప్రదాయబద్దంగా యాత్రను ప్రారంభమైంది. పుణ్యక్షేత్రం బోర్డు.. ఆనవాయితీగా వస్తున్న ఆచారాల్ని, క్రతవుల్ని పాటిస్తూ రక్షాబంధన్‌ రోజున సంప్రదాయ ముగింపు పూజ కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించింది. 
 
కొవిడ్ 19 దృష్ట్యా సామాన్య భక్తులకు ఈ యాత్రకు అవకాశం లేకపోవటంతో టీవీ ఛానెల్‌లు, సామాజికమాధ్యమాల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యక్ష ప్రసారాలను శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు ఏర్పాటు చేసింది.