సంబంధిత వార్తలు
- సోషల్ మీడియాకు దూరంగా పాఠశాల విద్యార్థులు.. నిషేధించే చట్టం.. ఏపీ సర్కారు
- కన్నబిడ్డకు నిద్రమాత్రలిచ్చి.. ప్రియుడితో అత్యాచారం చేయించింది..
- మరికొన్ని గంట్లలో పెళ్లిపీటలెక్కాల్సిన అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య
- భార్య - ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త
- పాత కక్షలు... వ్యాపారిని హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు.. ఎక్కడ?
ఉత్తరాఖండ్.. మరిది ముందే వివాహితపై సామూహిక అత్యాచారం..
ఉత్తరాఖండ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై ముగ్గురు కామాంధులు తుపాకీతో బెదిరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. చివరికి పోలీసులు ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి గాంధీ పార్క్లో జరుగుతున్న సరస్ మేళా చూసి బాధితురాలు తన మరిదితో కలిసి బైక్పై ఇంటికి తిరిగి వస్తున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కీచా బైపాస్లోని మోదీ మైదాన్ సమీపంలోకి రాగానే, రెండు బైక్లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డగించారు. ఆపై తుపాకీతో బెదిరించి.. మరిది కళ్ల ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
నిందితులు బాధితురాలి మరిదికి తెలిసినవారేనని తెలుస్తోంది. బాధితురాలు ప్రతిఘటించడంతో ఓ నిందితుడు కత్తితో ఆమె ఎడమచేతి వేలును కోశాడు. అనంతరం, చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు ధైర్యం చేసి రాంపురా పోలీస్ ఔట్పోస్ట్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు బాధితురాలి మరిదికి పరిచయస్తులు కావడంతో, అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు జరుగుతోంది.
