1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Why Skyroot's Vikram-1 Launch Could Be A Turning Point For India

విక్రమ్-1 విజయవంతం.. లాంచ్ వ్యూ గ్యాలరీలో మంత్రి లోకేశ్‌, దేవాన్ష్.. మోదీ కితాబు

Nara Lokesh
Nara Lokesh
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగ ప్రస్థానంలో విక్రమ్-1 ఒక కీలక మైలురాయిగా నిలిచింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ ప్రయోగం.. అంతరిక్ష వాణిజ్యంలో దేశానికి కొత్త ద్వారాలు తెరిచింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికగా జరిగిన ఈ చరిత్రాత్మక ప్రయోగాన్ని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి వీక్షించారు. 
 
షార్‌లోని ఒకటవ ప్రయోగ వేదిక నుంచి విక్రమ్-1 రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు షార్‌లోని లాంచ్ వ్యూ గ్యాలరీకి మంత్రి లోకేశ్‌, దేవాన్ష్ హాజరయ్యారు. రాకెట్ విజయవంతంగా గమ్యాన్ని చేరుకోవడంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ తొలి ప్రయోగంలో విక్రమ్-1 రాకెట్ నాలుగు చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి తీసుకెళ్లింది. వీటిలో గ్రహాస్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ పేలోడ్లు ఉన్నాయి.
 
భారత తొలి ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌-1 ప్రయోగం విజయవంతమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్కైరూట్‌ బృందానికి ఫోన్‌ చేసి అభినందించారు. సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో సంబరాలు జరుగుతున్న సమయంలో వచ్చిన ఈ కాల్‌లో యువ శాస్త్రవేత్తల కృషిని ప్రధాని ప్రశంసించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి