సంబంధిత వార్తలు
- చారిత్రాత్మక విక్రమ్-1 ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం
- కోవిడ్ కేసులు: కేరళలో 115, కర్నాటక 64, ఏపీలో 13 మాత్రమే, కానీ అప్రమత్తం
- హైదరాబాద్లో మళ్లీ అడుగుపెట్టిన బర్గర్ సింగ్: 30 అవుట్లెట్ల ఏర్పాటుకు సన్నాహాలు
- ఆ మూడు మార్కెట్లో వన్ప్లస్ దశలవారీగా నిష్క్రమణ
- సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టనున్న భారతీయ రైల్వే ... 17న హైడ్రోజన్ ఇంధన రైలు
విక్రమ్-1 విజయవంతం.. లాంచ్ వ్యూ గ్యాలరీలో మంత్రి లోకేశ్, దేవాన్ష్.. మోదీ కితాబు
Nara Lokesh
షార్లోని ఒకటవ ప్రయోగ వేదిక నుంచి విక్రమ్-1 రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు షార్లోని లాంచ్ వ్యూ గ్యాలరీకి మంత్రి లోకేశ్, దేవాన్ష్ హాజరయ్యారు. రాకెట్ విజయవంతంగా గమ్యాన్ని చేరుకోవడంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ తొలి ప్రయోగంలో విక్రమ్-1 రాకెట్ నాలుగు చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి తీసుకెళ్లింది. వీటిలో గ్రహాస్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ పేలోడ్లు ఉన్నాయి.
భారత తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్కైరూట్ బృందానికి ఫోన్ చేసి అభినందించారు. సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో సంబరాలు జరుగుతున్న సమయంలో వచ్చిన ఈ కాల్లో యువ శాస్త్రవేత్తల కృషిని ప్రధాని ప్రశంసించారు.
