శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (16:38 IST)

దీపాన్ని ఎలా వెలిగించాలి.. ఎలా కొండెక్కించాలంటే?

దీపాన్ని కొండెక్కించడం.. ఆర్పేందుకు కొన్ని పద్ధతులున్నాయి. గృహంలోని పూజాగదిలో దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి దేవిల శక్తులుంటాయి. దీపకాంతి ఇంట్లోని దుష్టశక్తులను తరిమికొడుతుంది. దీపారాధానకు ఉపయోగించే దీపపు కుందిలో త్రిమూర్తులు నివాసం వుంటారు. దీపారాధన కుందిలో నూనె లేదా నెయ్యి పోసి ఆ నెయ్యి వున్నంత వరకు దీపాన్ని వెలిగించాలి. 
 
వత్తులు పూర్తిగా మండుకోక ముందే దీపాన్ని కొండెక్కించాలి. దీపాన్ని వెలిగించినప్పటి నుంచి కొండెక్కించేంత వరకు నూనె ఆ దీపంలో వుండేలా చూసుకోవాలి. దీపాన్ని కొండెక్కించేటప్పుడు నోటితో వూదడం చేయకూడదు. పువ్వులతో దీపాన్ని కొండెక్కించాలి. దీపంలో మహాలక్ష్మి, దీపకాంతిలో సరస్వతి, దీపంలో వెచ్చదనంలో పార్వతీ దేవి కొలువైవుంటారు. 
 
అందుకే దీపాన్ని వెలిగిస్తే.. త్రిమూర్తులను, ముగ్గురమ్మలను కొలిచినవారమవుతాం. ఇంకా నేతి దీపాన్ని వెలిగించిన వారికి సకలశుభాలు చేకూరుతాయి. అగ్గిపుల్లతో నేరుగా కుందులలో దీపాన్ని వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా లేదా ఏకహారతి ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి. దీపారాధన కుందిలో ఐదు వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. 
 
ఈ ఐదు వత్తుల్లో మొదటితి భర్త, సంతానం సంక్షేమం కోసం, రెండో వత్తి అత్తమామల సంక్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల క్షేమానికి, నాలుగోది గౌరవ ధర్మ వృద్ధులకు, ఐదోది వంశాభివృద్ధికి అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా వుండాలి. ఇంటి ముందు తులసి మొక్క ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే.. ఇంట్లోకి దుష్ట శక్తులు రావు. 
 
ముఖ్యంగా వెండి ప్రమిదల్లో నేతితో గానీ, నువ్వుల నూనెతో కానీ, పొద్దు తిరుగుడు నూనెతో కానీ దీపారాధన చేస్తే వారికి అష్ట నిధులు చేకూరుతాయని విశ్వాసం. కొన్ని ప్రాంతాల్లో దీపాన్ని విఘ్నేశ్వరుడిగానూ కొలుస్తారు. దీపారాధన సమయంలో విఘ్నేశ్వర స్తుతులు పాడితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దీపారాధన చేస్తే మేధస్సు పెరుగుతుంది. స్వాతిక మార్గంలో సంపాదన చేకూరుతుంది.