శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (12:25 IST)

దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే.. పడకగదిలో రాళ్ల ఉప్పును..? (video)

మీరు ఇతరులకు మంచి చేసేవారా? అయినా కొన్ని ఆర్థిక, మానసిక ఇబ్బందులు వేధిస్తున్నాయా? అయితే ఇలా చేయండి అంటున్నారు.. ఆధ్యాత్మిక నిపుణులు. కంటికి తెలియని ప్రతికూల శక్తుల కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతాయని వారు చెప్తున్నారు. అలాంటి శక్తులను పారద్రోలి.. ప్రతికూల ఫలితాలను తరిమికొట్టి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి ఒక్క రాళ్ల ఉప్పుకే వుంది. కంటి దృష్టి లోపాలను తొలగించుకోవాలంటే.. రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.. 
 
ఓ గాజు బౌల్‌ తీసుకుని అందులో వంటకు ఉపయోగించే రాళ్ల ఉప్పును వేయాలి. ఆ బౌల్‌ను స్నానపు గది అలమరాల్లో పైభాగాన వుంచాలి. ఈ బౌల్‌పై నీరు పడకూడదు. అలా వుంచిన ఉప్పు కరుగుతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్లీ ఉప్పును నింపి అదే ప్రాంతంలో వుంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టిలోపాలు వుండవు. దారిద్ర్యం తొలగిపోతుంది. 
 
అంతేగాకుండా ఇంటిని వారానికి ఓసారి శుభ్రపరిచే నీటిలో పసుపు, రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో వుండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మంచి ఫలితాలుంటాయి. ఆర్థిక రాబడి వుంటుంది. ఇకపోతే.. ధనాన్ని వుంచే పర్సుల్లో చిటికెడు రాళ్ల ఉప్పును పేపర్లో మడతపెట్టి వుంచితే ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం వుండవు. 
 
ఇంకా దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే.. విభేదాలు తొలగిపోవాలంటే పడకగదిలోని పై అలమరాల్లో రాళ్ల ఉప్పును నింపిన బౌల్‌ను వుంచి వారానికి ఓసారి ఆ ఉప్పును మార్చుతూ వుంటే సరిపోతుంది. ఇకపోతే.. రోజువారీ ఉపయోగించే వాహనాలను శుభ్రపరిచేటప్పుడు కూడా ఆ నీటిలో రాళ్ల ఉప్పును వేసి శుభ్రపరచడం ద్వారా ప్రతికూల శక్తుల నుంచి తప్పుకోవచ్చు. ఇంకా వాహనాల కోసం వెచ్చించే అనవసరపు ఖర్చు తగ్గుతుంది. ఇంకా ప్రమాదాలు జరగవు. అంతేగాకుండా వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు వుండవు. మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. సానుకూల ప్రభావం ఏర్పడుతుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.