శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (09:54 IST)

రథసప్తమి: ఇలా చేస్తే శుభం.. చిక్కుడు లేదా జిల్లేడు ఆకులతో..

Surya Deva
రథసప్తమి రోజున సూర్య భగవానుడిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సూర్యభగవానుడిని ఆరాధించాలి. రథసప్తమి రోజున 7 చిక్కుడు ఆకులను తలపై పెట్టుకుని... మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలంటారు. 
 
ఆవుపాలు, అన్నం, బెల్లంతో పాయసం తయారు చేసి చిక్కుడు ఆకులు లేదా ఏదైన పల్లెంలో సూర్యదేవుడికి నివేదించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆదిత్యహృదయం, సూర్యష్టకం పారాయణం చేయాలి.
 
నీటిలో బెల్లం , ఎర్రటి పువ్వులు వేసి అర్ఘ్యం చేయండి. రథ సప్తమి నాడు స్నానమాచరించి పూజ చేసిన తరువాత పేద బ్రాహ్మణునికి పప్పు, బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు లేదా నారింజ వస్త్రాన్ని దానం చేయడం ద్వారా దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది.