1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Rathsaptami significance

రథసప్తమి: ఇలా చేస్తే శుభం.. చిక్కుడు లేదా జిల్లేడు ఆకులతో..

Surya Deva
రథసప్తమి రోజున సూర్య భగవానుడిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సూర్యభగవానుడిని ఆరాధించాలి. రథసప్తమి రోజున 7 చిక్కుడు ఆకులను తలపై పెట్టుకుని... మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలంటారు. 
 
ఆవుపాలు, అన్నం, బెల్లంతో పాయసం తయారు చేసి చిక్కుడు ఆకులు లేదా ఏదైన పల్లెంలో సూర్యదేవుడికి నివేదించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆదిత్యహృదయం, సూర్యష్టకం పారాయణం చేయాలి.
 
నీటిలో బెల్లం , ఎర్రటి పువ్వులు వేసి అర్ఘ్యం చేయండి. రథ సప్తమి నాడు స్నానమాచరించి పూజ చేసిన తరువాత పేద బ్రాహ్మణునికి పప్పు, బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు లేదా నారింజ వస్త్రాన్ని దానం చేయడం ద్వారా దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
29-01-2023 నుంచి 04-02-2023 వరకు మీ వార రాశిఫలాలు