1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Karthika pujas in Tirumala vasantamandapam

శ్రీవారి క్షేత్రంలో కార్తీక మాస పూజలు.. ఎప్పటి నుంచో తెలుసా?

Tirumala
తిరుమలలో శ్రీవారి క్షేత్రంలో కార్తీక మాస పూజలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం (నవంబర్ 23-2023) గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు విష్ణుసాలగ్రామ పూజ జరుగుతుంది. 
 
24న శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు కైశికద్వాదశి శ్రీతులసి దామోదర పూజ, 29న బుధవారం ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు గోపూజ, డిసెంబర్‌ 10న ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు ధన్వంతరి జయంతి పూజలు జరుగుతాయి. 
 
తిరుమల వసంతమండపంలో ఈ పూజ జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఈ పూజలు జరుపుతున్నట్లు టీటీడీ తెలిపింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
23-11-2023 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం...