1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Tirupati : Devotees Rush Increased in Tirumala

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారి పెరిగిన భక్తుల రద్దీ

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. తమ ఇష్టదైవమైన తిరుమల శ్రీనివాసుడుని దర్శనం చేసుకునేందుకు భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారు. దీంతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు

Tirupati
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. తమ ఇష్టదైవమైన తిరుమల శ్రీనివాసుడుని దర్శనం చేసుకునేందుకు భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారు. దీంతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండి వైకుంఠం వెలుపల కిలోమీటర్ మేర క్యూలైన్లలో బారులు తీరారు.
 
ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. కాగా, స్వామివారిని శనివారం 74,395 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,928 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.94 కోట్లుగా లెక్కగట్టారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సోమవారం (30-04-2018) - దంపతుల మధ్య పొత్తు కుదరదు...