సంబంధిత వార్తలు
- ఏయూ విద్యార్థులు దేశ భవిష్యత్తు.. ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు వుంది: పవన్ (video)
- జగిత్యాలలో ఘోరం.. ముగ్గురు ఇంటర్ విద్యార్థులు మృతి
- తెలంగాణ: బడుల్లో ఇక రకరకాలైన టిఫిన్లు.. పాలు, రాగి జావ.. మెనూ ఇదే
- ఆంధ్రప్రదేశ్లోని 2,800 మందికిపైగా విద్యార్థులకు మలబార్ గోల్డ్- డైమండ్స్ స్కాలర్షిప్
- సూర్య నుండి స్ఫూర్తి పొందిన మెగాస్టార్ చిరంజీవి... పవన్ కల్యాణ్ ప్రశంసలు
మద్యం సేవించిన ఒక జిమ్ ట్రైనర్.. కారుతో బైకును ఢీ కొట్టాడు.. ఇద్దరు మృతి
మద్యం సేవించిన ఒక జిమ్ ట్రైనర్.. గంటకు 130 కిలోమీట్లకు పైగా వేగంతో ఒక ఖరీదైన సెడాన్ కారును నడుపుతూ ఆగి వున్న ఎలక్ట్రిక్ బైకును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించగా, ఒక పాదచారి గాయపడ్డాడు. ఈ ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది.
బాధితులు, 20 ఏళ్ల కంచర్ల శివ, నాకిరేకంటి సందీప్ కుమార్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్ ముందు డివైడర్ వద్ద తమ ఎలక్ట్రిక్ స్కూటర్పై నిలబడి ఉన్నారు. ఈ టూవీలర్ను కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు.
పెట్రోల్ బంక్ నుండి రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల సబావత్ శ్రీధర్ అనే మరో పాదచారి కూడా గాయపడ్డారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో జిమ్ ట్రైనర్ రక్తంలో 160 బీఏసీ ఉన్నట్లు తేలింది. కారును స్వాధీనం చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు.
