1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Kamareddy Man Ends Life Along With his 2 Kids

పిల్లలకు బిర్యానీ పెట్టి.. నీళ్లల్లో ముంచి చంపేశాడు.. ఆపై అతను కూడా?

Crime news
Crime news
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి, ఒక వ్యక్తి తన ఇద్దరు చిన్న పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. మృతులను సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌కు చెందిన కృష్ణ (32), అతని కుమారుడు రక్షిత్ (8), కుమార్తె అనన్య (5)గా గుర్తించారు. బంధువుల సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు, ప్రాజెక్టు నుండి ఆ ముగ్గురి మృతదేహాలను వెలికితీశాయి.

ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో కృష్ణ అతని భార్య సవితల మధ్య గొడవలు జరుగుతుండేవని.. పదేళ్ల క్రితం వీరికి వివాహం జరిగిందని తెలిసింది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కృష్ణ తన పిల్లలు తన మరణానికి అనంతరం అనాధలుగా మారుతారనే ఉద్దేశంతో వారితో పాటే జలాశయంలోకి దూకి ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటనకు ముందు ప్రాజెక్టు సమీపంలో చెట్ల కింద పిల్లలు ఇద్దరికీ కడుపు నిండా బిర్యానీ పెట్టి.. కాసేపు జలాశయంలో ఆడుకోనిచ్చి.. ఆపై సెల్ఫీలు దిగి.. ఆ నీళ్లల్లోనే వాళ్లను ముంచి చంపేశాడు. 
 
చివరికి తాను కూడా ఆ నీళ్లల్లో మునిగి మృతి చెందాడు. ఎంతసేపటైనా పిల్లలతో వెళ్లిన కృష్ణ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
తరచూ పుట్టింటికి వెళ్తుందనే అసహనం.. భార్యను చంపేసిన భర్త