1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. New railway time table to come into force from January 1

జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త రైల్వే టైంటేబుల్

Indian Railways
నూతన సంవత్సరంలో రైల్వే కొత్త టైంటేబుల్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల రాకపోకల్లో చోటుచేసుకునే సమయాలతో ఈ టైంటేబుల్‌ను విడుదల చేయనున్నారు. ఈ కొత్త టైంటేబుల్ జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే శనివారం తెలిపింది. ముఖ్యంగా, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా మొత్తం 25 రైళ్లు బయలుదేరే వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. 
 
సికింద్రాబాద్ - విశాఖపట్టణం వందే భారత్ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజూ ఉదయం 5.05 గంటలకు బయలుదేరుతుంది. ఇది జనవరి ఒకటో తేదీ నుంచి ఐదు గంటలకే బయలుదేరుతుంది. అలాగే, సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి ఉదయం 8.20కి బదులుగా 8.10కి, సికింద్రాబాద్ - భద్రాచలం ఎక్స్‌ప్రెస్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 5.25 బదులుగా 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. ఈ మార్పుల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో చూడొచ్చని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ తెలిపారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Hyderabad: డిజిటల్ అరెస్ట్ కేసు.. మహిళ నుంచి రూ.1.95 కోట్లు దోచుకున్న ఇద్దరు అరెస్ట్