1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. south central railway key decision on satavahana express stop

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

Trains
శాతనవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపేజీపై దక్షణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో స్టాపేజీని కల్పించారు. ఈ నెల 30 నుంచి ప్రయోగాత్మకంగా ఆగుతుందని పేర్కొంది. ఈ స్టేషన్‌లో ఒక నిమిషం పాటు ఆగుతుందని పేర్కొంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రైలుకు రైలుకు స్టాఫ్ కల్పించారు. విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ మధ్య అనునిత్యం రాకపోకలు సాగించే ఈ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై జనగామ్ రైల్వే స్టేషన్‌లో ఆగుతుంది.
 
ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 30వ తేదీ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు జనగామ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ఆగుతుందని ప్రకటించింది. విజయవాడ - సికింద్రాబాద్ రైలు ఉదయం 10.14 నుంచి 10.15 గంటల ఒక మధ్య నిమిషంతో పాటు సికింద్రాబాద్ - విజయవాడ రైలు సాయంత్రం 5.19 నుంచి 5.20 గంటల మధ్య జనగామ రైల్వే స్టేషన్‌లో ఒక నిమిషం పాటు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
తర్వాతి కథనం
తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది