1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana Education Ministry key decision on 10th Class Public Examination

టెన్త్ పరీక్షలపై టీఎస్ విద్యాశాఖ కీలక నిర్ణయం

Telangana Education Ministry
పదో తరగతి పరీక్షా ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఇప్పటి వరకు 11 ప్రశ్నలు ఉండగా, ఈ సంఖ్యను ఇపుడు ఆరుకు తగ్గించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 
 
కోవిడ్‌ నేపథ్యంలో నెలకొన్ని పరిస్థిల కారణంగా విద్యార్థులపై భారంపడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021-2022 విద్యా సంవత్సరానికిగానూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అలాగే, పరీక్షలను కూడా ఇకపై ఒక్కో స‌బ్జెక్టుకు ఒక్కో పేప‌రే ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ ఏడాదికిగానూ ఉర్దూను సెకండ్ ల్యాంగ్వేజ్‌ను ప‌రిగ‌ణిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేర‌కు ప‌ది ప‌రీక్షల విధానంపై విద్యాశాఖ కార్యద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఈ యేడాది పదో పరీక్షలకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తర్వాతి కథనం
జగన్ రెడ్డి కట్టించే ఇళ్లు శోభనానికి కూడా పనికిరావట‌!