గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 15 అక్టోబరు 2020 (18:42 IST)

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ను వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయనున్నారు. రామ్ చరణ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. చిరు, చరణ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే... ఆచార్య తర్వాత చిరంజీవి వినాయక్‌తో లూసీఫర్ రీమేక్, మెహర్ రమేష్‌తో వేదాళం రీమేక్ చేయనున్నారు. అయితే.. ఆచార్య తర్వాత వెంటనే ఏ సినిమా చేస్తారనేది సస్పెన్స్‌గానే ఉండేది. 
 
అయితే.. తాజా వార్త ఏంటంటే... ముందుగా డైనమిక్ డైరెక్టర్ వినాయక్‌తో లూసీఫర్ రీమేక్ చేస్తారనుకున్నారు కానీ... మెహర్ రమేష్‌తో వేదాళం రీమేక్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.
 
ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముహుర్తం కూడా ఫిక్స్ చేసారట. ఇంతకీ ఎప్పుడంటారా..? దసరాకి ఈ సినిమా ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. చిరంజీవి ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి మెహర్ రమేష్ రెడీగా ఉన్నాడని టాక్. ఈ సినిమా తర్వాత వినాయక్‌తో లూసీఫర్ రీమేక్‌ను ఫిబ్రవరిలో ప్రారంభించాలి అనుకుంటున్నారు.
 
ఆ తర్వాతే బాబీతో సినిమా ఉంటుంది. ఈ లెక్కన బాబీ చిరంజీవితో సినిమా చేయటానికి చాలా టైమ్ పడుతుంది. ఈలోపు బాబీ వేరే సినిమా చేస్తాడో.. అప్పటివరకు వెయిట్ చేస్తాడో..?