1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Shraddha Kapoor finally opens up on gossips

బుర్ర నిండా చెత్త నింపుకోవడం మానేస్తా : శ్రద్ధా కపూర్

Shraddha Kapoor
పత్రికల్లో, వెబ్ మీడియాలో వస్తున్న గాసిప్స్‌పై "సాహో" చిత్ర హీరోయిన్ శ్రద్ధా కపూర్ తనదైనశైలిలో స్పందించారు. ఆ చెత్తనంతా నా బుర్రలో నింపుకోను అని చెప్పుకోచ్చింది.
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, 'మనం దేన్ని గురించి పట్టించుకోవాలి? దేన్ని వదిలేయాలనే విషయంపై మనకో క్లారిటీ ఉండాలి. అప్పుడే బుర్ర నిండా చెత్త నింపుకోవడం మానేస్తాం. లేకుంటే మనకే మనం డస్ట్‌ బిన్‌లాగా కనిపిస్తాం' అని చెప్పారు. 
 
'ఎవరైనా నా వ్యక్తిగత జీవితం గురించి పత్రికల్లో రాస్తే నేను చదవను. నిజ నిర్ధారణ లేని వార్తల పట్ల నాకు పెద్ద పట్టింపు ఉండదు. కొన్నిసార్లు ఎవరైనా మరీ అతిగా రాసినట్టు తెలిస్తే మాత్రం కంగారు పుడుతుంది. అలాంటి సమయంలో మా నాన్న నా పక్కన నిలుచుంటారు. ఆయనకు మీడియా గురించి చాలా బాగా తెలుసు' అని చెప్పారు. 
 
మరోవైపు సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లోనూ టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల శ్రద్ధ అనారోగ్యం పాలయ్యారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని మహిళలకు రక్షణ కల్పించమని ప్రార్థిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మవారి ఫొటోను షేర్‌ చేశారు. 
తర్వాతి కథనం
నయనతారను పెళ్లి చేసుకున్న హీరో రోడ్డున పడతారా?