1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (18:28 IST)

రైలులో ఇఫ్తార్ విందు - రైల్వే శాఖపై ప్రశంసల వర్షం

train
ముస్లిం సోదరులు పవిత్ర పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ నెలలో ప్రతి ఒక్క ముస్లిం రంజాన్ ఉపవాసం ఉంటారు. అలాగే, ముస్లిం సోదరుల కోసం అనేక సంస్థలు, ప్రభుత్వాలు ఇఫ్తార్ విందులను ఇస్తుంటాయి. అయితే, ఇపుడు ఈ తరహా ఇఫ్తార్ విందును రైల్వే శాఖ కూడా ఏర్పాటు చేసింది. దీంతో రైల్వే శాఖపై ప్రశంసల వర్షం కురుస్తుంది. 
 
దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా గుర్తింపు పొందిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లై రైల్వే శాఖ ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ రైలులో ప్రయాణించే ముస్లిం ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా భోజనం అందజేసింది. ఈ మీల్స్‌ను ఓ ముస్లిం సోదరుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను చూసిన యూజర్లు రైల్వే శాఖపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
షా నవాజ్ అక్తర్ అనే వ్యక్తి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో ఇటీవల ప్రయాణించారు. ఆయనకు టీ కావాలని, కానీ ఉపవాసం కావడం వల్ల కొంచెం ఆలస్యంగా తీసుకు రమ్మని ప్యాంట్రీ సిబ్బందికి విన్నవించారు. కానీ, ప్యాంట్రీ సిబ్బంది మాత్రం ఇఫ్తార్ విందు తీసుకొచ్చి ఆశ్చర్యపరిచారని చెప్పారు. దీంతో తెగ ఆనందపడిపోయిన అక్తర్ ఆ విషయాన్ని ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.