1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Undavalli Aruna Kumar comments on ap cm chandrababu naidu over special status

చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి : ఉండవల్లి

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నిజాలు చెప్పాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Undavalli Aruna Kumar
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నిజాలు చెప్పాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను పక్కనె పెట్టి, రాష్ట్రాన్ని కాపాడేందుకు వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. 
 
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని కోరారు. కేంద్రంపై న్యాయ పోరాటం చేయాలని సూచించారు. ప్రత్యేక హోదాకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులలో రిట్ పిటిషన్లు ఉన్నాయని... వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని సూచించారు. 
 
కౌంటర్ ఫైల్ చేయడానికి 24 గంటల సమయం కూడా పట్టదన్నారు. చంద్రబాబు బాధ్యతలను నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో తనకున్న విచక్షణాధికారంతో తమను అప్పటి స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారని... ఇప్పుడు సభలో ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సభ్యులను కూడా స్పీకర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రేపిస్టులను బహిరంగంగా కాల్చిపారేయాలి : బీజేపీ ఎంపీ