Author Hanumantha Reddy 16.html

Notifications

national news
Chitra SP
Chitra SP

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియోరీల్స్ పిచ్చి ముదిరిపోయి ప్రాణాల మీదకు తెస్తున్నా అందులో నుంచి బైటకు రావడంలేదు చాలామంది. ఇట్లాంటి రీల్స్ పిచ్చితో ఓ వ్యక్తి ఏకంగా జాతీయ రహదారిపై ప్రమాదకర ఫీట్స్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో జాతీయ రహదారిపై స్కూటర్ పైన ఓ వ్యక్తి వేగంగా ప్రయాణిస్తూ ఒక్కసారిగా దాని హ్యాండిల్ వదిలేసాడు. చక్కగా బాసింపట్లు వేసుకుని కూర్చుని, వెకిలిగా నవ్వుతూ వాహనాలు వేగంగా వెళ్తున్నప్పటికీ పట్టించుకోవడంలేదు. ఈ ప్రమాదకర స్టంట్ పైన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలుసినీ రంగంలో వుండేవారికి చదువు, సంస్కారం, శీలం వుండవని, తాగుబోతులు, తిరుగుబోతులు, వాగుబోతులు వుంటారని పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు చేసారు. అట్లాంటివారు సినిమాల్లో వుంటే వారి గురించి వ్యాఖ్యానించేదేమి ఏమీ వుండదనీ, ఐతే రాజకీయాల్లోకి వస్తే మటుకు వారిని విమర్శించకుండా వుండబోమని ఆయన చెప్పుకొచ్చారు. పాశం మాట్లాడుతూ... ఇప్పటివరకూ వారు ఒక్క దేశభక్తి సినిమా అయినా తీసారా, అన్నీ బూతు సినిమాలే. అసలు సినిమా రంగానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడమే తప్పు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి గతంలో ఎన్టీఆర్ పైన దాడి చేసి, చెప్పులతో కొట్టినవారే. ఇప్పుడు ఆయన విగ్రహాలు పెడుతున్నారు.

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటనతెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకు హాజరయ్యే భక్తుల కోసం, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) ఒక ప్రత్యేక ప్యాకేజీ పర్యటనను ప్రకటించింది. టీఎస్‌టీడీసీ విడుదల చేసిన పర్యటన బ్రోచర్ ప్రకారం, ఈ ప్యాకేజీలో 30 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఏసీ హైటెక్ స్లీపర్ బస్సులో ప్రయాణం ఉంటుంది. ఈ పర్యటనకు రుసుమును పెద్దలకు రూ. 3,600 గానూ, పిల్లలకు రూ. 2,880 గానూ నిర్ణయించారు. ఈ యాత్ర మొదటి రోజు రాత్రి సీఆర్వో బషీర్‌బాగ్, ఐఆర్వో యాత్రినివాస్ (సికింద్రాబాద్) నుండి ప్రారంభమవుతుంది. భక్తులు మరుసటి రోజు తెల్లవారుజామున కాళేశ్వరం చేరుకుంటారు.

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహంమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదల ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారిపోతాయి. నిస్తేజానికి లోనవుతారు. చేబదుళ్లకు స్వీకరిస్తారు. సన్నిహితులు సాయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు మీ కష్టం ఫలిస్తుంది. వాహన సౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పొదుపు ధనం అందుకుంటారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. దంపతుల మధ్య స్తబ్ధత నెలకొంటుంది. కొత్త యత్నాలు మొదలు పెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. శుభకార్యానికి హాజరువుతారు.

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు