1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. If same situation continue like this Covid deaths may double in Upcoming Weeks, Warned by Experts

భారత్ శవాల దిబ్బగా మారనుందా? నిపుణులు ఏమంటున్నారు?

Covid Deaths
భారత్‌ శవాల దిబ్బగా మారుతుందా? ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా వ్యాపిస్తోంది. అదేసమయంలో మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం భారత్‌లో తలెత్తింది. కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి రాబోయే వారాల్లో మరింత విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
కొన్ని పరిశోధనలు చెబుతున్న దానిప్రకారం మరణాల సంఖ్య ప్రస్తుత స్థాయిలను మించి రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఉన్న ఇదే పోకడలు కొనసాగితే జూన్ 11 నాటికి 4,04,000 మరణాలు సంభవిస్తాయని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం చెబుతోంది. 
 
వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ నుండి వచ్చిన ఒక లెక్క జూలై చివరి నాటికి 1,018,879 మరణాలను అంచనా వేసింది. భారతదేశం వంటి విశాలమైన దేశంలో కరోనావైరస్ కేసులను ఊహించడం చాలా కష్టం. 
 
పరీక్షలు అలాగే సామాజిక దూరం వంటి ప్రజారోగ్య చర్యలను భారతదేశం వేగవంతం చేయవలసిన అవసరాన్ని ఈ సూచనలు ప్రతిబింబిస్తున్నాయి. ఒకవేళ ఈ అంచనాలను నివారించినా కూడా, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ -19 మరణాల సంఖ్యను రికార్డు చేసే అవకాశం ఉంది. యు.ఎస్ ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో 578,000 మరణాలను కలిగి ఉంది.
 
కాగా, మంగళవారం దేశంలో కొత్తగా 3,57,229 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 20 మిలియన్ల మంది ఇప్పటివరకూ కరోనా బారిన పడ్డారు. అదేవిధంగా మొత్తం మరణాల సంఖ్య 2,22,408కు చేరుకుంది. ఇటీవలి వారాల్లో, శ్మశానవాటికలకు వెలుపల క్యూ లైన్లు.. అంబులెన్స్‌లను వెనక్కి పంపించడం వంటి దృశ్యాలు సర్వ సాధారణం అయిపోయాయి. ఇది దేశంలోని ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కరోనా తండ్రి మృతి.. మనస్తాపంతో తండ్రి చితిలో దూకిన కుమార్తె... ఎక్కడ?