అమరావతి: 250 మీటర్ల అసెంబ్లీ స్పైర్ ప్రతిపాదనకు ఆమోదం
Amaravathi
ఈ సమావేశంలో అమరావతికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోని ఎల్పీఎస్ జోన్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 1,548 కోట్ల విలువైన టెండర్లను ఆహ్వానించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
అలాగే, హోటళ్లు, పాఠశాలల కోసం భూమిని కేటాయించే విషయంలో మంత్రివర్గ కమిటీ చేసిన సిఫార్సులకు కూడా ఆమోదం లభించింది. భూ సమీకరణ ప్రక్రియలో భాగంగా, రెండో దశలో ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు వార్షిక పరిహారం చెల్లించేందుకు కూడా సీఆర్డీఏ సమావేశం ఆమోదం తెలిపింది.
అమరావతిలో జీవవైవిధ్యాన్ని కాపాడుతూనే, 50 శాతం మేర సుస్థిరమైన పచ్చదనం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థను ఆదేశించారు.
