1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. APTDC Rushikonda Tourism Project Night View

రుషికొండ ప్యాలెస్.. సీఎం క్యాంప్ ఆఫీస్ అవుతుందా.. డ్రోన్ ఫోటోలు వైరల్

RishiKonda
RishiKonda
ఏపీ టూరిజం చేపట్టిన రుషికొండ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో వివాదాస్పదంగా మారింది. అయితే ప్యాలెస్ లాంటి రుషికొండ భవనాలను ఇటీవలే ఏపీ టూరిజం మంత్రి రోజా ప్రారంభించారు. దీనిని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చవచ్చని ఆమె పేర్కొన్నారు. 
 
అంతకుముందు, భవనాల చిత్రాలను విడుదల చేయలేదు. ప్రారంభోత్సవం రోజున మీడియాను కూడా అనుమతించలేదు. అయితే రుషికొండ ప్యాలెస్‌కు సంబంధించిన ఫోటోలను డ్రోన్ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో భవనం లైట్లతో ఓ వెలుగు వెలిగిపోతోంది. ప్యాలెస్ లా కనిపించే ఫోటోలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
రుషికొండ భవనాలను సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భావిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రారంభోత్సవం సందర్భంగా రోజా చేసిన తాజా వ్యాఖ్యలు కొనసాగుతున్న వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
తర్వాతి కథనం
వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి