1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Gradual crowd of devotees in Thirumala

తిరుమలలో క్రమక్రమంగా భక్తుల రద్దీ

crowd
తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం 2కోట్ల 31లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

నిన్న శ్రీవారిని 35265మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 15451 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు

భవాని దీక్షల విరమణ
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో భవాని దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. శనివారం ఉదయం పూర్ణాహుతితో ఈ భవాని దీక్ష విరమణ ముగింపు పలికారు. ఐదురోజుల పాటు వైభవంగా భవానీ దీక్ష విరమణలు సాగాయి. 

ఈ సందర్భంగా ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ... భవాని భక్తుల కోసం రేపు కూడా దీక్ష విరమణకి ఏర్పాట్లు యధాతధంగా  ఉంటాయని తెలిపారు. లక్షా 10 వేల మంది ఇప్పటి వరకు అమ్మవారిని దర్శించుకున్నారని... ఈ రోజు, రేపు మరో 40 వేలు మంది దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నట్లు  చెప్పారు. సంవత్సరం లోపే దుర్గ గుడి అభివృద్ధి చేస్తామని ఈవో సురేష్ బాబు వెల్లడించారు. .
About Writer
ఎం
తర్వాతి కథనం
చంద్రబాబుది కూల్చే సంస్కృతి - జగన్‌ది నిలబెట్టే నైజం : మోపిదేవి