సంబంధిత వార్తలు
- వైకాపా నేతలపై తాడేపల్లి పోలీస్ స్టేషనులో అట్రాసిటీ కేసులు
- సుగాలి ప్రీతి హత్య కేసు దర్యాప్తును ఏపీ సర్కారు నిర్లక్ష్యం చేసింది.. జగన్ ఫైర్
- వైకాపా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే .. 11 అరాచకాలు ఇవిగోండి : సీఎం చంద్రబాబు ధ్వజం
- విమాన ప్రయాణాలకు పవన్ సొంత డబ్బునే వాడతారు.. జగన్కు షాకిచ్చిన నాదెండ్ల
- ప్రేమికుల పెళ్లి విషయంలో రూ. 70 వేల లంచం అడిగిన ఎస్సై, ACBకి పట్టించారు
చంద్రబాబే విలన్.. మావిగన్ ఎజెండాతో ఎన్నికల బరిలో దిగుతాం.. జగన్మోహన్ రెడ్డి
Jagan
ఏపీకి చంద్రబాబే అసలు విలన్ అని, సినిమాల్లోని విలన్ల పనులు ఆయన కళ్ల ముందే జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. అమరావతిలో రైతుల తరఫున నిలబడితే తమను నిందితులుగా చిత్రీకరిస్తున్నారని, తమ పార్టీ నేతలపైనే దాడి చేసి, తమపైనే కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. పోలీసుల సమక్షంలోనే తమపై రాళ్లతో దాడి చేశారని, కార్ల అద్దాలు పగలగొట్టారని జగన్ ఆరోపించారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తే అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఇకపోతే.. వచ్చే ఎన్నికల్లో మావిగన్ అజెండాతోనే ముందుకు వెళ్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు. ఈ విధానానికి కట్టుబడి ఉంటామని, తమకు మద్దతు ఇచ్చేవారు తమకే ఓటు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఎవరెవరు వచ్చినా కలిసి పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
