సంబంధిత వార్తలు
- అలాంటి ఓటర్ల పేర్లను తొలగించడమే 'సర్' ఏకైక లక్ష్యం : ఎన్నికల సంఘం
- Olympics 2028: లాస్ ఏంజిల్స్లో ఒలింపిక్స్ 2028: జెంటిల్మెన్ గేమ్ మళ్లీ ఎంట్రీ!
- Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు
- Shubhanshu Shukla: జూలై 14న ఐఎస్ఎస్ నుంచి శుభాన్షు శుక్లా టీమ్ తిరుగు ప్రయాణం
- Bandi Sanjay Kumar: బండి సంజయ్ పుట్టిన రోజు.. పాఠశాల విద్యార్థులకు 20వేల సైకిళ్లు
Delhi EV Policy 2026: జూలై 1 నుంచి అమలులోకి ఢిల్లీ ఈవీ పాలసీ 2026
Delhi EV Policy 2026
ఈ పాలసీ ద్వారా రాబోయే నాలుగేళ్లలో పౌరులకు సుమారు రూ. 15,000 కోట్ల ప్రయోజనాలు చేకూరుతాయని సీఎం వివరించారు. ఇందులో భాగంగా, ప్రభుత్వం నేరుగా రూ. 7,000 కోట్లను ఛార్జింగ్ స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయనుంది. మరో రూ. 8,000 కోట్లను పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాల రూపంలో ఈవీ వినియోగదారులకు అందిస్తుంది.
లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు ఆమోదం తర్వాత ఈ పాలసీ అధికారికంగా అమల్లోకి వస్తుంది.
ఈ కొత్త పాలసీలో భాగంగా, 2027 జనవరి 1వ తేదీ నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్ లేదా సీఎస్ఓ ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్ను పూర్తిగా నిషేధిస్తారు. ఆ తర్వాత కేవలం ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
అదేవిధంగా, 2028 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పెట్రోల్, సీఎసీ టూవీలర్ల రిజిస్ట్రేషన్లను కూడా నిలిపివేయనున్నారు.
కొత్త విధానం ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి 100 శాతం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది.
కార్ల విషయానికొస్తే, రూ.30 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధర ఉన్న వాహనాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, కార్లు, తేలికపాటి గూడ్స్ ట్రక్కులు, గ్రామీణ సేవా వాహనాలతో సహా అన్ని రకాల వాహనాలకు ఈ పాలసీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సాధారణ వాహనాలకు, ఎలక్ట్రిక్ వాహనాలకు మధ్య ధర వ్యత్యాసాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ రాయితీలు రూపొందించినట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. కాలుష్య రహిత, స్వచ్ఛమైన రవాణా రాజధానిగా ఢిల్లీని మార్చడమే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
తర్వాతి కథనం
