1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Now passengers can book train tickets for their pets online

జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు

Pets
Pets
జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్. పెంపుడు జంతువులు కూడా ఇకపై రైలులో ప్రయాణించవచ్చు. రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం టీటీఈలకూ ఈ టిక్కెట్లను జారీ చేసే అధికారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. 
 
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. 
 
ఇందు కోసం ముందుగా ప్రయాణికులు స్టేషన్‌లోని పార్సిల్ కౌంటర్‌లో ఓ టిక్కెట్ కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఇక సెకండ్ క్లాస్ లగేజ్ లేదా బ్రేక్ వ్యాన్‌లో ఒక బాక్స్‌‌లో కూడా పెంపుడు జంతువులను తరలించే వీలుంది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
నేడే టెన్త్ ఫలితాల విడుదల