1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (10:34 IST)

జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు

Pets
Pets
జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్. పెంపుడు జంతువులు కూడా ఇకపై రైలులో ప్రయాణించవచ్చు. రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం టీటీఈలకూ ఈ టిక్కెట్లను జారీ చేసే అధికారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. 
 
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. 
 
ఇందు కోసం ముందుగా ప్రయాణికులు స్టేషన్‌లోని పార్సిల్ కౌంటర్‌లో ఓ టిక్కెట్ కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఇక సెకండ్ క్లాస్ లగేజ్ లేదా బ్రేక్ వ్యాన్‌లో ఒక బాక్స్‌‌లో కూడా పెంపుడు జంతువులను తరలించే వీలుంది.