శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (17:25 IST)

సీబీఎస్ఈలో 10, 12వ తరగతుల పరీక్షలు రద్దు

కరోనా వైరస్ దెబ్బకు దేశం అల్లకల్లోలంగా మారింది. ఇది ప్రతి రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటిలో ఒకటి విద్యా రంగం కూడా ఉంది. ఈ వైరస్ మహమ్మారి దెబ్బకు చివరకు పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక పరీక్షలను రద్దు చేశాయి. ఈ కోవలోనే సీబీఎస్ఈ బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రెండ్రోజుల్లో వెలువరిస్తామని పేర్కొంది. గత విద్యా సంవత్సరంలో 10, 12 తరగతులకు సంబంధించి పరీక్షలు జరిగాయి. అయితే కొన్ని సబ్జెక్టులు మాత్రం మిగిలిపోయాయి. ఆ సబ్జెక్టులపై పరీక్షలు పెట్టాలని కొంతమంది కోరగా.. కరోనా నేపథ్యంలో వద్దని మరికొంతమంది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఒకసారి ఆలోచించాలని కేంద్రప్రభుత్వానికి సూచిందింది. 
 
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల పరీక్షలు రద్దు అవుతున్నాయి. దీంతో సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వివరించారు. నిజానికి, మిగిలిపోయిన పరీక్షలను జులై 1 నుంచి 15 వరకు సీబీఎస్‌ఈ పరీక్షలను నిర్వహించాలని కేంద్రం భావించిన విషయం తెల్సిందే.