బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జులై 2020 (10:15 IST)

తెలంగాణలో కరోనా విజృంభణ.. 13మంది మృతి

తెలంగాణలో కరోనా తీవ్రత అధికంగా వుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా వైద్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో బుధవారం 1,811 పాజిటివ్ కేసులు నమోదు కాగా..13 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 60,717కు చేరింది. అలాగే మొత్తం 505 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. 
 
జిల్లాల వారీగా అత్యధికంగా రంగారెడ్డిలో 289, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 151, వరంగల్‌లో 102, నల్లగొండలో 61 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే 18,263 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 4,16,202 మంది కరోనా పరీక్షలు జరిపారు.
 
తెలంగాణలో 16 ప్రభుత్వ, 23 ప్రైవేట్ ఆర్టీ పీసీఆర్, ట్రూనాట్, సీబీ నాట్ కరోనా పరీక్షా కేంద్రాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.