1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Today Covid Positive Cases in India

దేశంలో కొత్తగా మరో 8 వేల కరోనా పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కొత్తగా మరో ఎనిమిది వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన ప్రకటనలో గడిచిన 24 గంటల్లో 8,586 మందికి ఈ వైరస్ సోకినట్టు వెల్లడించింది. మరో 48 మంది కరోనా బాధితులు చనిపోయారు. గత 24 గంటల్లో 9,650 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
కొత్త కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,43,57,546కు చేరగా, ఇందులో 4,37,33,624 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,27,416 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 210.31 కోట్ల మందికి ఈ టీకాలను పంపిణీ చేశారు. 
తర్వాతి కథనం
వచ్చే ఎన్నికల తర్వాత తెదేపా ప్రభుత్వం ఏర్పాటు తథ్యం : ఆర్ఆర్ఆర్ సర్వే