బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (13:35 IST)

ఏ బ్లడ్ గ్రూపు వారికి కరోనా వైరస్‌తో ముప్పు?

ఇపుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా వేలల్లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కరోనా వైరస్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, తాజాగా ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ రెండు గ్రూపుల వారిలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుందని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
ఇతర బ్లడ్ గ్రూపుల వారి కంటే.. 'ఒ' మరియు 'ఎ' గ్రూపులకు చెందిన వారిలోనే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని తేలింది. కరోనా వైరస్ బారినపడిన రెండు వేల మంది పాజిటివ్ రోగులకు జరిపిన పరీక్షల్లో ఈ విషయం తేలింది. ఈ పరిశోధన కరోనా వైరస్ పురుడు పోసుకున్న చైనాలోని వుహాన్, షెంజెన్ నగరాల్లో జరిగింది. 
 
అయితే, ఏ బ్లడ్ గ్రూపు వారి కంటే.. ఓ బ్లడ్ గ్రూపువారిలోనే ఈ వైరస్ వ్యాపిస్తుందని పరిశోధకులు తెలిపారు. పైగా, ఈ రెండు గ్రూపుల వారిలోనే ఈ వైరస్ ఎందుకు వ్యాపిస్తుందన్న అంశాన్ని కనుగొనే పనిలో పరిశోధకులు నిమగ్నమైవున్నారు. ఈ పరిశోధన ప్రపంచ వ్యాప్తంగా సాగనుంది.