శుక్రవారం, 28 జూన్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (22:15 IST)

రాజకీయాల్లోకి రానున్న వీవీఎస్ లక్ష్మణ్.. ఆ పార్టీలో చేరుతారా?

భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. జాతీయ పార్టీ బీజేపీలో ఆయన చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే లక్ష్మణ్‌తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరికకు కేంద్ర హోమంత్రి అమిత్‌ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ, క్రికెట్ ఫ్యాన్స్ అంతా అభిమానించే లక్ష్మణ్‌ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించిందట. బీజేపీలో చేరేందుకు లక్ష్మణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.
 
లక్ష్మణ్ చేరికపై త్వరలోనే బీజేపీ అధికారిక ప్రకటన చేయనుందట. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఓ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు లక్ష్మణ్ వీడ్కోలు పలికారు. ఆ తర్వాత ఐపీఎల్ ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా ఉన్నారు.