సంబంధిత వార్తలు
- Rishabh Pant: మాంచెస్టర్ టెస్టు.. రిషబ్ పంత్ రికార్డ్.. గాయంతో అవుట్
- చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే
- Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?
- ఇంగ్లండ్లో ఇరగదీస్తున్న శుభ్మన్ గిల్.. గవాస్కర్, కోహ్లీ రికార్డులు బ్రేక్.. సిరాజ్ అదుర్స్
- చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. 800 పాయింట్లతో తొలి భారత వికెట్ కీపర్గా అదుర్స్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరమైన రిషబ్ పంత్.. కాలి బొటన వేలు విరిగింది..
Rishabh Pant
37 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత ఇన్నింగ్స్ 68వ ఓవర్లో పంత్ గాయపడ్డాడు. ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్పై రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, పంత్ కుడి పాదాన్ని బంతి తగిలింది. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు.
ఈ సంఘటన తర్వాత, పంత్ను స్కాన్ల కోసం ఆసుపత్రికి తరలించారు. "అవును, రిషబ్ పంత్ ఈ సిరీస్కు దూరమయ్యాడు. అతను నిన్న రాత్రి స్కాన్లకు వెళ్లాడు, డాక్టర్ ఇచ్చిన వివరాల ప్రకారం అతను బొటనవేలు విరిగినట్లు తేలింది. ప్రస్తుతం అతను చాలా నొప్పిగా ఉన్నందున అతను బ్యాటింగ్ చేసే అవకాశం లేదు" అని బీసీసీఐ అధికారులు చెప్తున్నారు.
