1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Gwalior Gangrape Case: Case of kidnapping and gang rape

గ్వాలియర్‌లో కిడ్నాప్ చేసి... బెంగుళూరులో గ్యాంగ్ రేప్...

rape victim
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కొందరు కామాంధులు.. ఆ బాలికను బెంగుళూరు నగరానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు మహిళతో పాటు మొత్తం ఐదుగురుని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత జనవరి నెలలో గ్వాలియర్‌కు చెందిన ఓ బాలికను నిందితులు కిడ్నాప్ చేసి బెంగుళూరుకు తరలించారు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి ఫిబ్రవరి నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెను మయామాటలు చెప్పి బెంగుళూరుకు తీసుకెళ్లారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలిక ఉన్న ప్రాంతాన్ని గుర్తించి రక్షించారు. ఆ సమయంలో ఆమె బందీగా ఉంచిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం బాలికను గ్వాలియర్‌లోని ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో నెల రోజుల పాటు ఉంచి తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 
ఇంటికి చేరుకున్న తర్వాత ఆ బాలిక తనకు జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. బెంగుళూరులో తనను బందీగా ఉంచడంతో పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు వాపోయింది. ఇందుకు ఇద్దరు మహిళలు కూడా సహకరించారని బాలిక చెప్పడంతో తల్లి మరోమారు పోలీసులను ఆశ్రయించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఆరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం విజయ్‌ వద్దే హోంశాఖ