సంబంధిత వార్తలు
- భార్య మరొకరితో వెళ్లిపోయిందనీ ఇద్దరు పిల్లలను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న భర్త
- చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి బౌలింగ్ వైఫల్యమే కారణం : అంబటి రాయుడు
- ఏప్రిల్ ఫూల్ కాదు... వంట గ్యాస్ వాయింపుడు... రూ.195 పెంపు
- విద్యార్థిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు... ప్రొఫెసర్ సస్పెండ్.. ఎక్కడ?
- ఐపీఎల్ 2026 సీజన్: రెండో దశ షెడ్యూల్ రిలీజ్
గ్వాలియర్లో కిడ్నాప్ చేసి... బెంగుళూరులో గ్యాంగ్ రేప్...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కొందరు కామాంధులు.. ఆ బాలికను బెంగుళూరు నగరానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు మహిళతో పాటు మొత్తం ఐదుగురుని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
గత జనవరి నెలలో గ్వాలియర్కు చెందిన ఓ బాలికను నిందితులు కిడ్నాప్ చేసి బెంగుళూరుకు తరలించారు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి ఫిబ్రవరి నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెను మయామాటలు చెప్పి బెంగుళూరుకు తీసుకెళ్లారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలిక ఉన్న ప్రాంతాన్ని గుర్తించి రక్షించారు. ఆ సమయంలో ఆమె బందీగా ఉంచిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం బాలికను గ్వాలియర్లోని ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో నెల రోజుల పాటు ఉంచి తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇంటికి చేరుకున్న తర్వాత ఆ బాలిక తనకు జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. బెంగుళూరులో తనను బందీగా ఉంచడంతో పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు వాపోయింది. ఇందుకు ఇద్దరు మహిళలు కూడా సహకరించారని బాలిక చెప్పడంతో తల్లి మరోమారు పోలీసులను ఆశ్రయించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఆరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
