సంబంధిత వార్తలు
- కర్నాటకలో దారుణం : 13 యేళ్ల బాలికపై మైనర్ల గ్యాంగ్ రేప్
- Heavy Rush: వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో పోటెత్తిన జనం
- Srivari Laddus: శ్రీవారి లడ్డూ విక్రయంలో కొత్త రికార్డు.. పెరిగిన నాణ్యత, రుచే కారణం
- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ వైజాగ్ కాదా?
- కన్నడ నటుడు దర్శన్ భార్యకు అసభ్య సందేశాలు... ఇద్దరు అరెస్టు
చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పట్టణంలో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కేసు నమోదు చేశారు. ఈ ఘటన తిరుపతి రూరల్ పరిధిలో వెలుగు చూసింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన దంపతులు రోజువారీ కూలీ పనుల చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారు పనులకు వెళ్ళిన సమయంలో ఏడేళ్ల బాలిక ఇంటి సమీపంలోనే ఆడుకునేది. ఆ బాలికపై కన్నేసిన నిందితుడు నాగరాజు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి ఆ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ వెంటనే స్పందించిన పోలీసులు.. నిందితుడుని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే, బాలికను ఆస్పత్రికి తరలించి శారీరక, మానసిక వైద్య పరీక్షలు చేయించారు. ఈ కేసులో న్యాయపరమైన దర్యాప్తు జరుగుతోందని, నిందితుడికి చట్ట ప్రకారం శిక్షి తప్పదని పోలీసులు వెల్లడించారు.
