శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (08:14 IST)

రేణిగుంటలో దారుణం : కుమార్తెపై తండ్రి అత్యాచారం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న రేణిగుంటలో ఓ దారుణం జరిగింది. 14 యేళ్ల కన్న కూతురిపై ఓ కామాంధ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేణిగుంట మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను తిరుపతిలో వైద్యపరీక్షల కోసమని అక్టోబరు 24వ తేదీన ఇంటి నుంచి తీసుకెళ్లాడు. 
 
ఆపై రేణిగుంట, తిరుపతి మార్గంలోని లక్ష్మీపురం కాలనీకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లికి ఆలస్యంగా చెప్పడంతో ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.