సంబంధిత వార్తలు
- 20 గుంటల భూమి కోసం.. ఇద్దరు మైనర్ కుమారులకు విషం కలిపిన బిస్కెట్లు ఇచ్చిన తండ్రి.. ఎక్కడ?
- Cold Wave: తెలంగాణను చలి వణికిస్తోంది.. వైరల్ ఫీవర్లతో జాగ్రత్త.. వేడి నీరు తాగితే...
- రోడ్డు ప్రమాదం కేసు : బుల్లితెర నటుడు లోబోకు జైలుశిక్ష
- Jangaon: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను చంపేసిన ఇద్దరు మహిళలు
- ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు
పచ్చటి కుటుంబంలో చిచ్చుపెట్టిన నాటు కోడికూర... ఎక్కడ?
పచ్చటి కుటుంబంలో నాటు కోడి కూర చిచ్చుపెట్టింది. భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసింది. ఫలితంగా కన్నకొడుకు చేతిలో తండ్రి హతమయ్యడు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో ఈ దారుణం జరగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి అనే గ్రామానికి చెందిన జంగిటి రమేష్ (42) మంగళవారం రాత్రి 10 గంటలకు ఒక నాటు కోడి తీసుకొని వచ్చారు. కూర వండమని భార్య అనూషకు చెప్పారు. అయితే, ఇపుడు చేపలకూర చేశనని, ఇపుడు నాటు కోడి కూర వద్దని ఆమె చెప్పింది. ఈ క్రమంలో వారిద్దరికీ గొడవ జరిగింది. పక్కనే ఉన్న కుమారుడు గణేష్ మా అమ్మను ఎందుకు తిడుతున్నావు అని ప్రశ్నించాడు. దీంతో అతడిపై రమేష్ చేయిచేసుకున్నాడు.
క్షేణికావేశంలో గణేశ్ పక్కనే ఉన్న రోకలిబండతో తండ్రి తలపై బాదాడు. రమేష్ అక్కడే పడిపోవడంతో సుంకరి హరీష్ అనే వ్యక్తి గమనించి చికిత్స నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని అక్కడికి వైద్యులు సూచించారు. హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే బుధవారం ఉదయం 11 గంటలకు రమేశ్ మృతి చెందారు. మృతుడి సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తర్వాతి కథనం
