1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ISRO Chief Narayanan Visits Tirumala with GSLV-F17, EOS-05 Rocket Models

జీఎస్‌ఎల్వీ-F17, ఈఓఎస్-05 రాకెట్ల మోడల్స్‌తో తిరుమలలో ఇస్రో ఛైర్మన్ (video)

ISRO Chief Narayanan
ISRO Chief Narayanan
ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ బుధవారం తిరుమలను సందర్శించారు. ఈ సందర్భంగా, ఆయన జీఎస్‌ఎల్వీ-F17,  ఈఓఎస్-05 రాకెట్ల నమూనాలను శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం కావాలని ఆయన స్వామివారి ఆశీస్సులు కోరారు.
 
పూజల అనంతరం, రంగనాయకుల మండపంలో వేద పండితుల నుండి వేదాశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు ఆయనను పవిత్ర వస్త్రంతో సత్కరించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జీఎస్‌ఎల్వీ-ఎఫ్17, ఈఓఎస్-05 మిషన్ సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించబడనుంది.
 
జీఎస్ఎల్వీ కేట‌గిరీలో ఇది 19వ రాకెట్ కావ‌డం విశేషం. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి ఈఓఎస్-05 ఉప‌గ్ర‌హాన్ని తీసుకెళ్ల‌నున్నారు. జియో ప్లాట్‌ఫామ్‌పై ప్ర‌యోగిస్తున్న తొలి భార‌తీయ ఉప‌గ్ర‌హం ఈఓఎస్-05 అని నారాయ‌ణ‌న్ తెలిపారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
Sonu Sood: నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్