తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడం శని, ఆదివారాలు సెలవులు రాడంతో భక్తుల రాక కూడా పెరిగింది. ఇది శనివారం మరింత పెరిగే అవకాశం ఉంది. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.