Last Modified: శుక్రవారం, 23 జనవరి 2015 (07:32 IST)
తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 14 కంపార్టుమెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక దర్శనం కోసం 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.