1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (14:11 IST)

భారత్ అప్రమత్తం.. ఆప్ఘన్ నుంచి రావాలంటే ఈ వీసా తప్పనిసరి

ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాలన ఏర్పడటంతో దౌత్యపరంగా భారత్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆంక్షల్ని కఠినం చేస్తోంది.
 
మారుతున్న ఆఫ్ఘన్ పరిణామాల్ని పొరుగు దేశమైన ఇండియా ఓ కంట కనిపెడుతోంది. ఆఫ్ఘన్‌కు సరిహద్దు దేశమైన పాకిస్తాన్ తాలిబన్లకు వత్తాసు పలకడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దౌత్యపరంగా ఇండియా కొన్ని కీలక నిర్ణయాల్ని తీసుకుంటోంది. ఆఫ్ఘన్ నుంచి ఇండియాకు రావాలంటే ఈ వీసా తప్పనిసరి అంటోంది. 
 
ఇండియాకు వచ్చే విమాన మార్గంలో ఈ వీసా ఉంటేనే ఆఫ్ఘన్ పౌరుల్ని అనుమతిస్తామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ వీసా తీసుకోవాలంటే అక్కడి రాయబార కార్యాలయానికి నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. 
 
సంక్షోభ పరిస్థితుల కారణంగా ఎంబసీను మూసేయడంతో ఈ వీసా(E Visa) దరఖాస్తు అనివార్యమైంది. ఈ వీసా ఆరు నెలల వరకూ చెల్లుబాటవుతుంది. సాధారణ వీసాలు లభ్యమై..ఇండియాకు చేరకపోతే ఆ వీసాలు చెల్లుబాటు కావు.