సంబంధిత వార్తలు
- సెలక్షన్ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ - కొత్త వారి కోసం దరఖాస్తుల ఆహ్వానం
- గాజాలోని శరణార్థ శిబిరంలో అగ్నిప్రమాదం.. మూడు తరాలవారు సజీవదహనం
- ప్లీజ్... నా డెలివరీ డేట్ కూడా చెప్పరూ.. నిక్కీ గల్రానీ వినతి
- 19-11-2022 శనివారం దినఫలాలు - శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన...
- ఉద్విగ్నభరితమైన క్రైమ్ ధ్రిల్లర్ ధారావీ బ్యాంక్తో ఒరిజినల్ కంటెంట్ను బలోపేతం చేస్తున్న ఎంఎక్స్ ప్లేయర్
ఇకపై "లింగం" ఏదైనా కావొచ్చు.. అందరినీ "ఆమె"గానే సంబోధన...
కేంద్ర ప్రభుత్వం మరో కీలక బిల్లును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. స్త్రీపురుష, నపుంసక లింగాల్లో ఏది అయినప్పటికీ అందరినీ ఆమెగానే సంబోధించేలా బిల్లును రూపొందిస్తుంది. ఇందుకోసం "డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్" బిల్లును రూపకల్పన చేసి వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించనుంది.
"బేటీ బచావో.. బేటీ పడావో" స్ఫూర్తిగా కేంద్రం ప్రభుత్వం ఓ సరికొత్త బిల్లును తీసుకునిరానుంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ పేరుతో ఈ బిల్లును తీసుకొస్తుంది. పైగా, దీన్ని వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదా బిల్లులో స్త్రీలు, పురుషులు, నపుంసక లింగలకు చెందిన వారందరిని ఆమె అనే పద ప్రయోగం చేశారు.
వారు ఏ వర్గానికి చెందినవారైనా సరే అంటే స్త్రీ, పురుషుడు, నపుంసక లింగాల్లో ఎవరైనప్పటికీ ఆ వ్యక్తిని సంబోధించేటపుడు ఆమె లేదా ఆమెను అనే పదాలను ఉపయోగించాలని ఈ ముసాయిదా బిల్లు చెబుతోంది. మహిళలను సాధికారులను చేయాలన్న ప్రభుత్వం సిద్ధాంతానికి అనుగుణంగా ఈ మాటలు ఉపయోగించినట్టు ఈ ముసాయిదా బిల్లు చెబుతోంది.
