సంబంధిత వార్తలు
- అమరవీరుని పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్న మంచు ఫ్యామిలీ
- జమ్ము-కాశ్మీర్లో మిలిటెంట్ల దాడి.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
- గుర్రంపై వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేసిన అమేజాన్ డెలివరీ బాయ్.. వీడియో వైరల్
- జమ్మూకాశ్మీర్లో శాంతి నెలకొనడాన్ని పాకిస్థాన్ సహించలేకపోతోంది.. అందుకే ఇలా?
- స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల తరుణంలో శ్రీనగర్లో పోలీసు బృందంపై ఉగ్రవాదులు దాడి
శ్రీనగర్ దన్మార్ ఏరియాలో ఎన్కౌంటర్.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటరులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పుల్లో ఈ ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.
కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని దన్మార్ ప్రాంతంలో ఉన్న ఆలమ్దార్ కాలనీలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి.
ఈ సందర్భంగా గాలింపు బృంధాలపై ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. మరణించినవారిని లష్కరే తొయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించారు.
