శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (21:19 IST)

ఆర్‌బిఐ రుణాలపై మార‌టోరియం మరో మూడు నెలలు పొడిగింపు: ఒత్తిడికి గురైన మార్కెట్లు

దేశంలోని రిటైల్ ఋణగ్రహీతలకు ఉపశమనం కలిగించడానికి టర్మ్ లోన్‌లపై తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలల పొడిగించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన తరువాత, భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఎరుపు రంగులో ముగిశాయి. ఈ నిర్ణయం అంశం, భారతదేశ ఆర్థిక రంగానికి పెట్టుగా భావించబడి, మదుపరులు ఆందోళనకు గురయ్యారు. ఆర్‌బిఐ తీసుకున్న ఇతర నిర్ణయాలలో రెపో రేటులో 40 బేసిస్ పాయింట్లు తగ్గించబడి 4 శాతానికి కుదించబడడం ఉన్నాయి.
 
ఎస్‌అండ్‌పి బిఎస్ఇ సెన్సెక్స్ రోజు 260 పాయింట్లు లేదా 0.84 శాతం 30,672.59 వద్ద ముగియగా, నిఫ్టీ -50 ఇండెక్స్ నేటి ట్రేడింగ్ సెషన్‌ను 67 పాయింట్లు లేదా 0.74 శాతం నష్టంతో 9,039.25 వద్ద ముగించింది. మార్కెట్లో ఈరోజు ఆకర్షన వలన, దలాల్‌స్ట్రీట్‌లో గత మూడు సెషన్ల విజయ పరంపరతో ముగించింది.
 
ఈ రోజు ట్రేడింగ్‌లో, 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 18 స్టాక్స్ ఎరుపు రంగులో ముగిశాయి. ఇక విస్తృత మార్కెట్లో, ఎస్ అండ్ పి బిఎస్ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.83 శాతం పడిపోయి 11,270 కి చేరుకుంది, ఎస్ అండ్ పి బిఎస్ఇ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం తగ్గి 10,524.23 వద్ద ముగిసింది.
 
ఆర్‌బిఐ నిర్ణయం ఒత్తిడిలో, నిఫ్టీ బ్యాంక్ ఈ రోజు 456 పాయింట్లు లేదా దాని విలువలో 2,57 శాతం తగ్గి 17,278.90 వద్ద ముగిసింది, అయితే బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 0.83 శాతం తగ్గింది.
 
ఈ రోజు అధిక నష్టానికి గురైనవారు యాక్సిస్ బ్యాంక్ (5.32%), హెచ్‌డిఎఫ్‌సి (5.03%), మరియు బజాజ్ ఫిన్ (4.50%) ఉన్నారు, అయితే ఈ రోజు ఎం&ఎం (4.30%), ఇన్ఫోసిస్ (2.98%) మరియు ఆసియా పెయింట్స్ (2.60%) ఎక్కువ లాభాలు పొందాయి.
 
బ్యాంకింగ్ స్టాక్‌లలో, ఆర్‌బిఐ యొక్క విలేకరుల సమావేశంలో ఋణాలపై మూడు నెలల తాత్కాలిక నిలిపివేతను ప్రకటించిన తరువాత ఎస్‌బిఐ కార్డులు కొత్త కనిష్ట ధర 495 రూపాయలను తాకింది, ఈ స్టాక్, 6 శాతం తగ్గి, రూ. 510 లవద్ద ముగిసింది.
 
ఈరోజు, ఆయిల్, టెలికాం సమ్మేళనం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రపంచవ్యాప్త పెట్టుబడి సంస్థ కెకెఆర్ ద్వారా జియో వేదికలలో గత ట్రేడింగ్ సెషన్ లో తన ముగింపు విలువ రూ. 11,367 కోట్ల ప్రకటనతో పోలిస్తే, ఈ రోజు 0.5 శాతం తక్కువగా రూ. 1,431.60 వద్ద ముగిసింది. ఈ కంపెనీ, గత ఒక నెలలో,  ఫేస్ బుక్ ఇంక్ తో సహా ప్రపంచవ్యాప్త కంపెనీలకు అనేక విడతులుగా వాటా విక్రయాలను జరిపి, టెలికాం వ్యాపారంలో పెట్టుబడిదారులను ఆకర్షించింది. 
 
ప్రపంచ మార్కెట్లు
హాంకాంగ్‌పై కొత్త భద్రతా చట్టాన్ని విధించాలని చైనా నిర్ణయించిన తరువాత అవి అమెరికా మరియు ఆసియా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి దారితీయగలవిగా మారేసరికి, ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్‌లో, హాంగ్ కాంగ్ యొక్క హ్యాంగ్ సెంగ్ సూచిక 5 శాతానికి పైగా పడిపోయింది, ఇది 7 వారాల కనిష్టాన్ని తాకింది, జపాన్ యొక్క నిక్కీ 0.8 శాతం పడిపోయింది.
 
- అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్