మహానంది ఆలయానికి సామాన్య భక్తుడి రూ.2కోట్ల విలువైన భారీ విరాళం (video)
mahanandi
భక్తుడైన ఆ రిటైర్డ్ లెక్చరర్.. మహానందికి రూ.2కోట్లకు పైగా విలువైన ఆస్తులను విరాళంగా అందజేశారు. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రాజు, శకుంతల అనే దంపతులు ఈ విరాళాన్ని మహానందికి ప్రకటించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఈ విరాళాల కింద మహానంది ఆలయానికి 2.10 ఎకరాల భూమిని, ఐదు సెంట్లలో కట్టిన ఇంటిని అందజేశారు. గురువారం దేవస్థానం ఈవో చేతికి ఈ ఆస్తులకు చెందిన పత్రాలను దంపతులు ఇద్దరూ అందజేశారు. మహానంది ఆలయం అభివృద్ధి కోసం రాజు గతంలోనూ విరాళాలు అందించారు.
నంద్యాల....మహానంది ఆలయంకు భారీ విరాళం
— RTV (@RTVnewsnetwork) October 25, 2024
రెండు కోట్ల విలువైన 2 ఎకరాల10 సెంట్ల భూమి,ఇంటిని దేవాలయంకు రాసి ఇచ్చిన భక్తుడు
రిటైర్డ్ లెక్చరర్ రాజు దాతృత్వం పై ప్రశంసల వెల్లువ
దాత రాజు,శకుంతల దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సన్మానించిన ఈఓ శ్రీనివాస రెడ్డి.#kurnool #Mahanandi #RTV pic.twitter.com/ZfkejjXWfF
