1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Donated Two Crores To Mahanandi Temple

మహానంది ఆలయానికి సామాన్య భక్తుడి రూ.2కోట్ల విలువైన భారీ విరాళం (video)

mahanandi
mahanandi
శ్రీశైలం ఆలయానికి వెళ్లిన భక్తులు.. మహానంది ఆలయానికి కూడా వెళ్లటం పరిపాటి. అయితే తాజాగా మహానంది ఆలయానికి భారీ విరాళం అందింది. మహానంది ఆలయానికి ఓ రిటైర్డ్ లెక్చరర్ భారీ విరాళం అందజేశారు. 
 
భక్తుడైన ఆ రిటైర్డ్ లెక్చరర్.. మహానందికి రూ.2కోట్లకు పైగా విలువైన ఆస్తులను విరాళంగా అందజేశారు. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రాజు, శకుంతల అనే దంపతులు ఈ విరాళాన్ని మహానందికి ప్రకటించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 
 
ఈ విరాళాల కింద మహానంది ఆలయానికి 2.10 ఎకరాల భూమిని, ఐదు సెంట్లలో కట్టిన ఇంటిని అందజేశారు. గురువారం దేవస్థానం ఈవో చేతికి ఈ ఆస్తులకు చెందిన పత్రాలను దంపతులు ఇద్దరూ అందజేశారు. మహానంది ఆలయం అభివృద్ధి కోసం రాజు గతంలోనూ విరాళాలు అందించారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
రిలయన్స్‌ డిజిటల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌తో భారతదేశం సంబరాలు చేసుకుంటోంది