నిర్మానుష్య ప్రాంతంలో కన్నబిడ్డపై దాష్టీకం.. చెప్పిన మాట వినలేదని దాడి
Manchiryala
కనికరం లేని ఆ తండ్రి చిన్నారి అరుపులను పట్టించుకోకుండా తన దాష్టీకాన్ని కొనసాగించాడు. అయితే అక్కడున్న పశువుల కాపరి ఆ తండ్రిపై మండిపడ్డాడు. ఇదేంపని అంటూ నిలదీశారు. పశువుల కాపరి గట్టిగా నిలదీయడంతో భయపడిన సతీశ్, వెంటనే తన కుమార్తెను బైక్పై ఎక్కించుకుని అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు.
అయితే, ఈ మొత్తం తతంగాన్ని సదరు పశువుల కాపరి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్గా మారింది. ఈ ఘటనపై స్థానికులు మరియు బాలల హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
