నిర్మానుష్య ప్రాంతంలో కన్నబిడ్డపై దాష్టీకం.. చెప్పిన మాట వినలేదని దాడి
మంచిర్యాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన ఆరేళ్ల కుమార్తె సరిగా చదవడం లేదని, మాట వినడం లేదనే సాకుతో ఆమెను బైక్పై ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి, ఆ చిన్నారిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. తండ్రి కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేక ఆ పసిపాప కేకలు వేస్తూ విలవిలలాడిపోయింది.
కనికరం లేని ఆ తండ్రి చిన్నారి అరుపులను పట్టించుకోకుండా తన దాష్టీకాన్ని కొనసాగించాడు. అయితే అక్కడున్న పశువుల కాపరి ఆ తండ్రిపై మండిపడ్డాడు. ఇదేంపని అంటూ నిలదీశారు. పశువుల కాపరి గట్టిగా నిలదీయడంతో భయపడిన సతీశ్, వెంటనే తన కుమార్తెను బైక్పై ఎక్కించుకుని అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు.
అయితే, ఈ మొత్తం తతంగాన్ని సదరు పశువుల కాపరి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్గా మారింది. ఈ ఘటనపై స్థానికులు మరియు బాలల హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.