తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో విషాదం.. రాజుకు గుండెపోటు.. ఫలించని సీపీఆర్ (video)
Man
పరిస్థితిని గమనించిన మంత్రి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజుకు సీపీఆర్ నిర్వహించి, ప్రథమ చికిత్స అందించారు. అనంతరం, వైద్య సిబ్బందిని పిలిపించి, అంబులెన్స్ ద్వారా ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి రాజు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శాసనసభ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
శాసనసభలో విషాద ఘటన.. వ్యక్తికి CPR చేసిన మంత్రి శ్రీహరి
— Tupaki (@tupaki_official) September 8, 2026
తెలంగాణ శాసనసభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి రాజు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
అదే సమయంలో అక్కడ ఉన్న మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించి… pic.twitter.com/UyWyrdgpTj
