గురువారం, 4 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (20:27 IST)

పరిహార పూజ చేశాకే కీర్తీ సురేష్ బాలీవుడ్ ఎంట్రీ?

సినీనటి కీర్తి సురేష్ సినీ భవితవ్యంపై జ్యోతిష్యులు వేణు స్వామి కామెంట్స్ చేశారు. కెరీర్‌లో ఆమె ఇబ్బంది పడకుండా వుండాలంటే.. ఆమె చేత పరిహార పూజ చేయించాలట. 
 
ఈ మేరకు కీర్తి సురేష్ తల్లి వేణు స్వామి చేతుల మీదుగా పూజలు చేయించాలని భావిస్తోందట. ఆ తర్వాతే కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. 
 
కాగా కీర్తి సురేష్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోదరిగా భోళా శంకర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో కీర్తి సురేష్ కూడా ట్రోల్స్‌కు గురైంది. అయితే త్వరలోనే కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. 
 
ఈ నేపథ్యంలో ఆమెకు అంతా కలిసి రావాలని జ్యోతిష్యుడు వేణు స్వామి వద్ద పూజలు చేయించాలని భావిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.