శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (14:55 IST)

బాలయ్య సరసన పాయల్ రాజ్‌పుత్.. శ్రియ, అంజలికి తర్వాత?

పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం బాలయ్యతో కలిసి నటించనుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా 'ఆర్‌ఎక్స్ 100' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్.. యూత్‌ని పిచ్చెక్కించింది. ఇందులో కార్తికేయ, పాయల్ మద్య వచ్చే లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్లలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. 
 
ఈ మూవీలో పాయల్ ఓ రేంజ్ లో స్కిన్ షో చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాయల్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకిమామలో నటించింది. కానీ పాయల్‌కు హిట్ దక్కలేదు.  
 
దీంతో హీరోయిన్ ఛాన్సులు లేకపోతే పోనీ అని ఐటమ్ గర్ల్‌గానూ మారింది. ఆ మధ్య తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ నటించిన 'సీత' మూవీలో ఓ ఐటమ్ సాంగ్‌లో కనిపించింది. తాజాగా ఈ భోజ్‌పూర్ భామకి నందమూరి బాలయ్య సరసన నటించే అవకాశం వచ్చిందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. తాజాగా బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఓ మూవీలో పాయల్ కి ఛాన్స్ వచ్చిందని టాక్.
 
బాలయ్య సరసన ఇప్పటికే శ్రియ - అంజలి పేర్లు వినిపించాయి. కాకపోతే ఈ మూవీలో శ్రియా నటిస్తుందా లేదా అన్న విషయంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పాయల్ పేరు తెరపైకి వచ్చింది. మరి ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.