Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...
Devi Sri Prasad
ఈ సినిమాకు ముగ్గురు హీరోలు తెరముందుకు వచ్చినా వెనుకడుగు వేశారు. కారణాలు ఏమైనా.. ఫైనల్ గా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తెరముందుకు వచ్చాడు. దీని కోసం ఆయన బాడీని కూడామార్చుకున్నాడు. ఫిలింనగర్ కథనాలు ప్రకారం త్వరలో సెట్ పైకి వెళ్ళనుంది. కానీ ఇంకా వారు కన్ ఫర్మ్ చేయలేదు.
కాగా, ఈ సినిమాకు మొదట బాలీవుడ్ సంగీత దర్శకుడు ద్వయం అజయ్-అతుల్ను సంప్రదించారని తెలిసింది. కానీ షడెన్ గా తనే సంగీతం సమకూరుస్తానని దేవీశ్రీ చెప్పినట్లు మరో కథ కూడా వినిపిస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియకానున్నాయి. కాగా, ఈ సినిమాకు కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.
