1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (14:40 IST)

సీనియర్ నటి శోభనకు ఒమిక్రాన్ పాజిటివ్

ప్రముఖ సినీ నటి, భరతనాట్య నృత్యకళాకారిని శోభనకు ఒమిక్రాన్ వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. తాను "కీళ్ల నొప్పులు, చలి"తో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ఇదే అంశంపై ఆమె ఆదివారం తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, కరోనా రెండు డోసుల టీకాలు వేయించుకున్నప్పటికీ తాను కరోనా ఒమిక్రాన్ బారినపడినట్టు వెల్లడించారు. 
 
"ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు ఒమిక్రాన్ వైరస్ సోకింది. నాకు కీళ్ల నొప్పులు, చలి, గొంతులో దురద, ముక్కుదిబ్బడ వంటి లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు తొలి రోజున బాగా ఉన్నప్పటికీ ఆ తర్వాత రోజు నుంచి కాస్త తగ్గాయి" అని అందులో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, టీకాలు వేసుకోవాలని ఆమె కోరారు.
 
ఇషా చావ్లాకు కరోనా 
తెలుగు అగ్ర హీరో బాలకృష్ణ నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటించిన ఇషా చావ్లా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. 
 
కాగా, ఈమె 'ప్రేమ కావాలి' అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటించారు. అలాగే హీరో సునీల్ నటించిన 'పూలరంగడు', 'మిస్టర్ పెళ్లి కొడుకు', 'జింప్ జిలానీ', 'విరాట్', 'రంభ ఊర్వసి మేనక' వంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు. 
 
ప్రస్తుతం బాలీవుడ్ దర్శకనిర్మాత కబీర్ లాల్ ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్న "దివ్య దృష్టి" అనే చిత్రంలో ఆమె ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది.